15, ఏప్రిల్ 2015, బుధవారం

నేను ఇంటర్మీడియేట్ చదివే రోజుల్లో మా తెలుగు మాస్టారు  కీర్తి శేశులు శ్రీ డి . వి . మురళి మొహనాచారి గారు,
తెలుగు పాఠాలు అద్భుతంగా చెప్పే వారు, ఆయన పద్యం పాడుతుంటే , పక్క గదిలో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు  వారి పాఠం ఆపి మరీ పద్యం వినేవారు .

ఆయన ఎన్నో పద్య , గద్య, రచనలు చేసారు .  ఆయన వ్రాసిన "  ఆళ్వారుల  చరిత్ర  "   డి . డి . 8 లో  ధారావాహికంగా  ప్రసారం అయింది ,  ఒక ఎపిసోడ్ లో నటించారు  కూడా .

ఆ మహాను భావుడు  వ్రాసిన  " భీమా ఏజెంట్  భీమా రావు  "   నాటికలో నేను భీమారావు గా నటించాను ,  దానికి  ఉత్తమ  నటుడు, బహుమతి కూడా గెలుపొందాను ,  గురువుగారి ఫోటో నాకు అందుబాటులో లేదు . మిత్రుల దగ్గర ఉంటె పోస్ట్ చేయ గలరు .

అలాంటి   ప్రభావ పూరితమైన, మార్గ దర్శక గురువులు  కొద్ది మందే ఉంటారు , అలాంటి వారికి పాదాభి వందనం .

గురుబ్యోనమః



కామెంట్‌లు లేవు: