27, డిసెంబర్ 2015, ఆదివారం

సర్వశ్రీ ఎమ్. ఎస్. రామకృష్ణ గారు, బాచి గారు, సరసి గారు, లేపాక్షి గారు, బండి రవీందర్ గారు మహా మహులైన వారి కార్టూన్లతో పాటు నా కార్తూన్లని కూడా ప్రదర్శనకి స్వీకరించి నన్ను ఎంతగానో ప్రోత్సహించి  నాకు   ఇంతటి అదృష్టాన్ని ప్రసాదించిన వారికివే నా హృదయ పూర్వక ధన్యవాదములు .



23, డిసెంబర్ 2015, బుధవారం

                          విజయవంతమైన కార్టూన్ ల ప్రదర్శన 
సర్వశ్రీ ఎమ్. ఎస్. రామకృష్ణ, బాచి , సరసి  , లేపాక్షి , బండి రవీందర్, నాగ్రాజ్  గార్లు                                             ఆరుగురు కార్టూనిస్టుల సంకల్పం కృషి వెరసి  మాదాపూర్   " స్టేట్ ఆర్ట్ గ్యాలరి "  కావూరి హిల్స్ , హైదరాబాద్ లో నిర్వహించిన కార్టూన్ల ప్రదర్శన విజయవంత మైంది . 
    తేది 19 డిసెంబెర్  నుండి 21 డిసెంబెర్ వరకు నిర్వహించిన ఈ కార్టూన్ల ప్రదర్శనకు   ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ బి. వెంకటేశ్వర్లు  i.a.s. , గారు జ్యోతి వెలిగించి ప్రారంబించారు , ఈ కార్యక్రమంలో ఆర్ట్ గ్యాలరి డైరెక్టర్ శ్రీ మనోహర్ గారు, శ్రీ దైవజ్ఞ శర్మ గారు, ప్రముఖ కార్టూనిస్టులు సర్వశ్రీ  E R M రాజు గారు,అరుణ్ గారు,వర్చస్వి గారు ,రామ్ శేషు గారు , నూకాపతి గారు, హరికృష్ణ గారు, కొండ రవి ప్రసాద్ గారు,  ప్రముఖ చిత్రకారులు బాలు గారు , వాసు గారు , వేగి రాజు సుబ్బరాజు గారు, కార్టూన్ ఇష్టులుమచిలీ పట్నం పామరు కృష్ణ గారు, జి సి పద్మాదాస్ గారు, A R సుధాకర్ గారు పాల్గొన్నారు . 













           ప్రదర్శనలో ఉంచిన కార్టూన్లను తిలకించిన శ్రీ బి . వెంకటేశ్వర్లు ఐఏఎస్  ముఖ్య అతిథి గారు  ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు, ఇంతటి అద్బుతమైన ప్రదర్శనని నిర్వహించిన ఆరుగురు కార్టూనిస్ట్ లను మనసారా అభినందించారు , కార్టూన్ అనేది ఎంతో క్లిష్టమైన ప్రక్రియ అని అది ఎంతో తెలివితో , ఆలోచనతో వేయవలసి ఉంటుంది అని వారి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు, ఇలాంటి ప్రదర్శనలు మరిన్ని జరగాలని  కోరుకున్నారు .    అరగంట మాత్రమే సమయం కేటాయించిన ఆయన ప్రదర్శనను తిలకిస్తూ , ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తూ  తొంబై నిమిషాలు అక్కడే గడిపారు . 
           ఆహ్వానితులందరికి  టీ , బిస్క్ ట్లు  ఏర్పాటు చేసారు . 
ప్రదర్శనను తిలకించడానికి వచ్చిన కార్టూనిస్టు లు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు ,  ప్రతి ఒక కార్టూనిస్ట్  ఇలాంటి ప్రదర్శనను  నిర్వహించాలని అభిలషించారు , ప్రదర్శనలకు సంబంధించి ఎన్నో విలువైన సలహాలు సూచనలు , కార్టూన్ వేసే విధానం గూర్చి ఎంతో సమాచారాని శ్రీ  ERM రాజు గారు అందించారు ,  ప్రముఖ  చిత్రకారులు సర్వశ్రీ  బాలు గారు , వాసు గారు, చిత్ర గారు, ఆనంద్ గారు, వేగిరాజు సుబ్బరాజు గారు తమ సంతోషాన్ని వ్యక్త పరిచారు, తమ అభిప్రాయాలను విసిటేర్స్ లిస్టులో పొందుపరిచి ఆనందంగా వెనుతిరిగారు . 
           సిని దర్శకులు శ్రీ ముళ్ళపూడి వర గారు, శ్రీ గాంధి గారు , ఈ ప్రదర్శన మాకెంతో నావ్వుల్ని ఆలోచనలని పంచింది అన్నారు . 
           ప్రముఖ కార్టూనిస్టు బన్ను గారు ప్రదర్శనని సందర్శించి అందర్నీ ఉత్సాహ పరిచారు ,  
        పెద్దలే కాకుండా పిల్లలు కూడా ప్రదర్శనకి రావడం కార్తూన్లని ఎంజాయ్ చేయడం  ప్రదర్శకులకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది , ప్రదర్శనకి  తిలకించడానికి  వచ్చిన    పిల్లలు ,పెద్దలు , స్త్రీలు , సీనియర్ సిటిజెన్లు  అందరు ఎంతో ఆనందాన్ని , ఉత్సాహాన్ని  మూటగట్టుకుని  తమ అభిప్రాయాన్ని విసిటేర్స్ లిస్టు లో వారి ఆనందాన్ని వ్రాసి  ఎన్నో నవ్వుల్నీ మోసుకెళ్ళారు .   శ్రీ బాచి గారి హాస్య రస కార్టూన్లు, శ్రీ సరసి గారి అపార్ట్ మ్మేంట్ కార్టూన్ లు , నాగ్రాజ్ గారి మెసేజ్ కార్టూన్ లు ,శ్రీ  బండి రవీందర్ గారి చమత్ కార కార్టూన్ లు , శ్రీ రామకృష్ణ గారి నావ్వుల పువ్వుల కార్టూన్ లు , శ్రీ లేపాక్షి గారి పంచ్ కార్టూన్ లు  అందరి సందర్శకులను హత్తుకున్నాయి . 
             కార్టూన్ ఇష్టులు  ఫేస్ బుక్ గ్రూప్ లలో కార్తూన్లని ప్రేమించే  సర్వశ్రీ  జే సి పద్మదాస్ గారు , శ్రీనివాస రావు వేముగంటి గారు , ముమ్మిడి పద్మిని గారు, ప్రతిభ అంచ గారు, వేణుగోపాల్ నెల్లుట్ల గారు  ఆనంద డోలికల్లో తేలి పోయారు . 
             ప్రదర్శనకి  విచ్చేసిన  నవ్య వీక్లీ సంపాదకులు ప్రఖ్యాత రచయిత శ్రీ జగన్నాధ శర్మ గారు  కార్టూన్ లని తిలకించి ఎంతో ఉత్సాహంగా వారి అభిప్రాయాలను వ్యక్త పరిచారు, ఎంతో విలువైన వారి సమయాన్ని కేటాయించి , వారి అనుభవాలను , ఆలోచనలను, పంచుకున్నారు  ప్రదర్శకులతో ఉల్లాసంగా గడిపి చిరు సత్కారాన్ని స్వీకరించి ,  మీతో నాలుగ్గంటలు యిట్టె గడిపానంటే నమ్మలేక పోతున్న భలే సంతోషం అని వారు అనడం కొస మెరుపు . 
             
              కార్టూన్ల ప్రదర్శన ఆరంభం నుండి చివరిదాకా ప్రదర్శకులలో ఒకరైన  శ్రీ బాచి గారి శ్రీమతి శాంతి గారు, కూతురు మధు గారు, చిన్నారి కార్టూనిస్టు గాయత్రి వారి సహాయాన్ని అందిచడం ముదావహం . 
               మొత్తానికి ఈ కార్టూన్ల ప్రదర్శన విజయవంతమై ఎంతో మంది కార్టూనిస్టుల లో ఉత్సాహాన్ని ,   అందాన్ని , ప్రేరణని  కలిగించింది . మరిన్ని కార్టూన్ ప్రదర్శనలు జరగడానికి ప్రేరణగా నిలిచింది . 
              నాలాంటి యువ కార్టూనిస్టు లకు మహామహులైన సర్వశ్రీ ఏం. ఏశ్. రామకృష్ణ గారు, సరసి గారు, బాచి గారు, లేపాక్షి గారు, బండి రవీందర్ గార్ల  ప్రోత్సాహం, వారి ప్రేమ ,  ఆదరణ , వారి ఆలోచనలు నాకు వారి పైన ఉన్న గవురవాన్ని రెట్టింపు చేసాయి , నా బాటకు  కొత్త వెలుగుని ప్రసాదించాయి .        

16, డిసెంబర్ 2015, బుధవారం

తప్పక రండి

తప్పక రండి

తేది ఈ నెల   19 శనివారం,  మొదలు 21 సోమవారం వరకు,  కార్టూన్ల ప్రదర్శన ......
తెలుగు కార్టూన్ లోకం లో లబ్దప్రతిష్టులు , ఉద్ధండులైన  సర్వశ్రీ  సరసి గారు,  ఎమ్. ఎస్. రామకృష్ణ గారు,  బాచి [ అన్నం శ్రీధర్ ] గారు,  లేపాక్షి గారు,  బండి రవీందర్ గారు  వారి కార్టూన్ లతో పాటు నా కార్టూన్లను కూడా  ప్రదర్శనకు  స్వీకరించి  నాకు ఇంతటి అదృష్టాన్ని ప్రసాదించిన మీకు సదా ఋణ పడి ఉంటాను . హృదయపూర్వక  ధన్యవాదములు  సర్ .

మిత్రులు మా ప్రదర్శనకు తప్పకుండా విచ్చేసి విజయవంతం చేయగలరని మనవి .

11, డిసెంబర్ 2015, శుక్రవారం

7, డిసెంబర్ 2015, సోమవారం

2, డిసెంబర్ 2015, బుధవారం

www.64kalalu.com   మాస పత్రిక డిసెంబెర్ 2015, సంచికలో   ' మన కార్టూనిస్టులు '  శీర్షిక లో  నా పరిచయం .
సంపాదకులు  శ్రీ కళాసాగర్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు.