22, జూన్ 2015, సోమవారం
16, జూన్ 2015, మంగళవారం
విశిష్ట బహుమతి
మే 20 , 2015 . రవీంద్రభారతి కాన్ఫరెన్సు హాల్లో జరిగిన తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం నాడు , తొలి తెలుగు కార్టూనిస్టు తలిశెట్టి రామారావు స్మారక కార్టూన్ పోటిలో విశిష్ట బహుమతి , సిని నటులు, రచయిత శ్రీ ఎల్ . బి . శ్రీరాం గారి చేతుల మీదుగా స్వీకరిస్తున్న సందర్బం , పక్కన సిని నటులు , దర్శకులు, రచయిత, శ్రీ తనికెళ్ళ భరణి గారు కూడా ఉన్నారు .
23, మే 2015, శనివారం
మే 20 వ తేది తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం
తొలి తెలుగు కార్టూనిస్టు తలిశెట్టి రామారావు జయంతి , మే 20 వ తేది తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం రవీంద్ర భారతి కాన్ఫరెన్సు హాల్లో అత్యంత వైభవంగా జరిగింది .
సత్కళా భారతి ఆద్వర్యంలో, aegis వారి సౌజన్యమ్థొ హాస్యానందం నిర్వహించిన ఈ పండుగ ఆహ్లాదకరంగా జరిగింది .
రెండు తెలుగు రాష్ట్రాల నుండి విచేసిన కార్టూనిస్టులు , కార్టూన్ ఇష్టులు , ముఖ్య అతిథులు సర్వశ్రీ k . v . రమణాచారి గారు, తనికెళ్ళ భరణి గారు, l . b . శ్రీరాం గారు, బాపు గారి తమ్ముడు ప్రముఖ చిత్రకారులు శ్రీ శంకర్ గారు,aegis శ్రీనివాస్ గారు, వేగిరాజు సుబ్బరాజు గారు,m . s . రామకృష్ణ గార్ల తో సభ నిండు తనాన్ని ఆపాదించుకుంది .
శ్రీ b . s . శర్మ గారు వ్యాఖ్యాత గా , మహిళా కార్టూనిస్టు వాగ్దేవి గారి ప్రార్థన తో సభ ప్రారంబించారు .
స్వర్గీయ తొలి తెలుగు కార్టూనిస్టు తలిశెట్టి రామారావు గారికి , బాపు రమణ లకి , పొలిటికల్ కార్టూనిస్టు శేఖర్ గారికి , తొలి తెలుగు మహిళా కార్టూనిస్టు రాగతి పండరి గారికి పూల మాలలతో అంజలి ఘటించి , జ్యోతి ప్రజ్వలన చేసారు .
ముందుగా శ్రీ తనికెళ్ళ భరణి గారు ప్రసంగిస్తూ , కార్టూన్లను , వాటిని గీసే కార్తూనిస్తులను ప్రశంశించారు . తనకి కార్టూన్ల పైనగల అభిమానాన్ని ఉటంకించారు . కార్టూనిస్టు లేన్దరినో ప్రోత్సహిస్తూ , పైసా ఆశించకుండా పన్నెండు సంవత్సరాలుగా హాస్యానందం మాస పత్రికను నడుపుతున్న రాము గారిని , హాస్యానందం రాముగా అభివర్ణించారు , ఆయన కృషిని కొనియాడారు . నాలుగు సంవత్సరాలుగా జరుపుకుంటున్న కార్టూనిస్టుల దినోత్సవం కార్టూనిస్టు లందరినీ ఒక్కచోట కలిపే వేదిక మారిందని అన్నారు .
పని ఒత్తిడి మూలంగా కార్టూన్ పోటిలో బహుమతి విజేతలు సర్వశ్రీ ఆకుండి . సాయి రామ్ , రామశేషు, రామ శర్మ ,రావెళ్ళ,శేఖర్,లేపాక్షి,క్రిష్ణ ,హరి,సునీల,అరుణ్,బివిఎస్ ప్రసాద్, చక్రవర్తి, నాగిశెట్టి, శివాజీ, నాగ్రాజ్ , వడ్డేపల్లి వెంకటేష్, ఎమెమ్ మురళి , రాంప్రసాద్ , బండి రవీందర్, శంబంగి , సంతోష్ కౌతమ్ , కశ్యప్ , మాంట్ క్రిస్టో లకు , బహుమతి ప్రదానం.
శ్రీ సత్ కళా భారతి సత్యనారాయణ గారు మాట్లాడుతూ , నాలుగు సంవత్సరాలుగా జరుపుకుంటున్న కార్టూనిస్టుల దినోత్సవం , దానికోసం నిర్వహించే కార్టూన్ పోటిలు విజయవంతం కావడానికి ముక్య కారకులు శ్రీ కె వి రామనాచారి గారేనని , వారు ప్రభుత్వ సలహా దారు మాత్రమే కాదని , ప్రపంచ తెలుగు వారందరి సలహాదారు, సహాయ దారులని కీర్తించారు . చంద్రుడికో నూలు పోగులా ఆయన్ని శాలువాతో సత్కరించారు .
ఈ కార్యక్రమానికి ఆర్ధిక సహకారం అందించిన aegis శ్రీనివాస్ గారు , కార్టూనిస్టు లకు శుభాకాంక్షలు తెలిపారు ,
రాము గారిని అభినందించారు , ఈ అవకాశం కల్పించిన శ్రీ కె వి రమణ చారి గారికి ధన్యవాదములు తెలిపారు .
బాపు రమణ అవార్డు ప్రదాత ఆత్రేయ పురం , శ్రీ వేగిరాజు సుబ్బరాజు గారు మాట్లాడుతూ , ఇకనుండి సీనియర్ కార్టూనిస్టు లైన ఒకరికి ప్రతి సంవత్సరం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, అత్యదికంగా కార్టూను లు పత్రికలలో ప్రచురితమైన కార్టూనిస్టు కి 5000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయించాం అని తెలిపారు .
శ్రీ కె వి రమణ చారి గారు మాట్లాడుతూ , విజేతలైన కార్టూనిస్టు లందరి పేర్లు ప్రస్తావించి శుభాకాంక్షలు తెలిపారు ,
కార్టూన్ల పైన తన మక్కువని తెలుపుతూ కొన్ని కార్టూన్లని ప్రస్తావించి సభలో నవ్వులు పూయించారు , రాము గారి ని ప్రశంశించి శాలువాతో సత్కరించారు, సత్కళా భారతి సత్యనారాయణ గారు కూడా రాము గారిని సత్కరించారు. ప్రతి నెలా ఒక కార్టూనిస్టు పేర ప్రతేక సంచిక తీసుకు రావాలని సూచించారు .
అనంతరం శ్రీ ఎల్బి శ్రీరాం గారి హాస్యానందం ప్రత్యేక సంచిక ఆవిష్కరించి , ఎల్బి శ్రీరాం గారు ప్రసంగించారు, నేను గొప్ప వాడిని కాబట్టి నా ప్రత్యేక సంచిక రాము గారు రూపొందించలేదు, ప్రత్యెక సంచిక వేసారు కాబట్టే నేను గొప్పవాడిని అయ్యాను , అన్నారు . కార్టూనిస్ట్ లకు శుభాకాంక్షలు తెలిపారు . కార్టూన్ ల పైన తన అభిమానాన్ని చాటారు . రాము గారిని పూల మాల శాలువాతో సత్కరించారు .
ఎం ఎస్ రామకృష్ణ గారు మాట్లాడుతూ , ఎన్ని కార్టూన్ లు వేసా మన్నది కాదు, ఎన్ని మంచి కార్టూన్ లు వేసామన్నది చూసు కావాలన్న బాపు గారి మాటలని గురుతు చేసారు .
అనంతరం బాపు రమణ అవార్డు తో శ్రీ బాచి గారిని శాలువా,మొమెంటో ,ప్రశంశ పత్రంతో సన్మానించారు. శ్రీ శంకర్ గారు వేసిన తలిశెట్టి రామారావు గారి చిత్రాన్ని ప్రథమ,ద్వితీయ,తృతీయ బహుమతి విజేతలకి , బాపు రమణ అవార్డు విజేతకి అందించారు .
వ్యాఖ్యత బిఎస్ శర్మ గారి కొన్ని వ్యాఖ్యలతో సభలో నవ్వులు పూసాయి .
రాము గారి వందన సమర్పణ తో సభ ముగుసింది .
కార్టూనిస్టు ల ఆలింగానాలు, కరచాలనాలు , శుభాకాంక్షలతో , మధురమైన అనుభవాన్ని పదిలంగా దాచుకుని మరో మధురమైన సంవత్సరం కోసం ఆశతో , ఆనందంతో విశ్రమించారు .
సత్కళా భారతి ఆద్వర్యంలో, aegis వారి సౌజన్యమ్థొ హాస్యానందం నిర్వహించిన ఈ పండుగ ఆహ్లాదకరంగా జరిగింది .
రెండు తెలుగు రాష్ట్రాల నుండి విచేసిన కార్టూనిస్టులు , కార్టూన్ ఇష్టులు , ముఖ్య అతిథులు సర్వశ్రీ k . v . రమణాచారి గారు, తనికెళ్ళ భరణి గారు, l . b . శ్రీరాం గారు, బాపు గారి తమ్ముడు ప్రముఖ చిత్రకారులు శ్రీ శంకర్ గారు,aegis శ్రీనివాస్ గారు, వేగిరాజు సుబ్బరాజు గారు,m . s . రామకృష్ణ గార్ల తో సభ నిండు తనాన్ని ఆపాదించుకుంది .
శ్రీ b . s . శర్మ గారు వ్యాఖ్యాత గా , మహిళా కార్టూనిస్టు వాగ్దేవి గారి ప్రార్థన తో సభ ప్రారంబించారు .
స్వర్గీయ తొలి తెలుగు కార్టూనిస్టు తలిశెట్టి రామారావు గారికి , బాపు రమణ లకి , పొలిటికల్ కార్టూనిస్టు శేఖర్ గారికి , తొలి తెలుగు మహిళా కార్టూనిస్టు రాగతి పండరి గారికి పూల మాలలతో అంజలి ఘటించి , జ్యోతి ప్రజ్వలన చేసారు .
ముందుగా శ్రీ తనికెళ్ళ భరణి గారు ప్రసంగిస్తూ , కార్టూన్లను , వాటిని గీసే కార్తూనిస్తులను ప్రశంశించారు . తనకి కార్టూన్ల పైనగల అభిమానాన్ని ఉటంకించారు . కార్టూనిస్టు లేన్దరినో ప్రోత్సహిస్తూ , పైసా ఆశించకుండా పన్నెండు సంవత్సరాలుగా హాస్యానందం మాస పత్రికను నడుపుతున్న రాము గారిని , హాస్యానందం రాముగా అభివర్ణించారు , ఆయన కృషిని కొనియాడారు . నాలుగు సంవత్సరాలుగా జరుపుకుంటున్న కార్టూనిస్టుల దినోత్సవం కార్టూనిస్టు లందరినీ ఒక్కచోట కలిపే వేదిక మారిందని అన్నారు .
పని ఒత్తిడి మూలంగా కార్టూన్ పోటిలో బహుమతి విజేతలు సర్వశ్రీ ఆకుండి . సాయి రామ్ , రామశేషు, రామ శర్మ ,రావెళ్ళ,శేఖర్,లేపాక్షి,క్రిష్ణ ,హరి,సునీల,అరుణ్,బివిఎస్ ప్రసాద్, చక్రవర్తి, నాగిశెట్టి, శివాజీ, నాగ్రాజ్ , వడ్డేపల్లి వెంకటేష్, ఎమెమ్ మురళి , రాంప్రసాద్ , బండి రవీందర్, శంబంగి , సంతోష్ కౌతమ్ , కశ్యప్ , మాంట్ క్రిస్టో లకు , బహుమతి ప్రదానం.
శ్రీ సత్ కళా భారతి సత్యనారాయణ గారు మాట్లాడుతూ , నాలుగు సంవత్సరాలుగా జరుపుకుంటున్న కార్టూనిస్టుల దినోత్సవం , దానికోసం నిర్వహించే కార్టూన్ పోటిలు విజయవంతం కావడానికి ముక్య కారకులు శ్రీ కె వి రామనాచారి గారేనని , వారు ప్రభుత్వ సలహా దారు మాత్రమే కాదని , ప్రపంచ తెలుగు వారందరి సలహాదారు, సహాయ దారులని కీర్తించారు . చంద్రుడికో నూలు పోగులా ఆయన్ని శాలువాతో సత్కరించారు .
ఈ కార్యక్రమానికి ఆర్ధిక సహకారం అందించిన aegis శ్రీనివాస్ గారు , కార్టూనిస్టు లకు శుభాకాంక్షలు తెలిపారు ,
రాము గారిని అభినందించారు , ఈ అవకాశం కల్పించిన శ్రీ కె వి రమణ చారి గారికి ధన్యవాదములు తెలిపారు .
బాపు రమణ అవార్డు ప్రదాత ఆత్రేయ పురం , శ్రీ వేగిరాజు సుబ్బరాజు గారు మాట్లాడుతూ , ఇకనుండి సీనియర్ కార్టూనిస్టు లైన ఒకరికి ప్రతి సంవత్సరం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, అత్యదికంగా కార్టూను లు పత్రికలలో ప్రచురితమైన కార్టూనిస్టు కి 5000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయించాం అని తెలిపారు .
శ్రీ కె వి రమణ చారి గారు మాట్లాడుతూ , విజేతలైన కార్టూనిస్టు లందరి పేర్లు ప్రస్తావించి శుభాకాంక్షలు తెలిపారు ,
కార్టూన్ల పైన తన మక్కువని తెలుపుతూ కొన్ని కార్టూన్లని ప్రస్తావించి సభలో నవ్వులు పూయించారు , రాము గారి ని ప్రశంశించి శాలువాతో సత్కరించారు, సత్కళా భారతి సత్యనారాయణ గారు కూడా రాము గారిని సత్కరించారు. ప్రతి నెలా ఒక కార్టూనిస్టు పేర ప్రతేక సంచిక తీసుకు రావాలని సూచించారు .
అనంతరం శ్రీ ఎల్బి శ్రీరాం గారి హాస్యానందం ప్రత్యేక సంచిక ఆవిష్కరించి , ఎల్బి శ్రీరాం గారు ప్రసంగించారు, నేను గొప్ప వాడిని కాబట్టి నా ప్రత్యేక సంచిక రాము గారు రూపొందించలేదు, ప్రత్యెక సంచిక వేసారు కాబట్టే నేను గొప్పవాడిని అయ్యాను , అన్నారు . కార్టూనిస్ట్ లకు శుభాకాంక్షలు తెలిపారు . కార్టూన్ ల పైన తన అభిమానాన్ని చాటారు . రాము గారిని పూల మాల శాలువాతో సత్కరించారు .
ఎం ఎస్ రామకృష్ణ గారు మాట్లాడుతూ , ఎన్ని కార్టూన్ లు వేసా మన్నది కాదు, ఎన్ని మంచి కార్టూన్ లు వేసామన్నది చూసు కావాలన్న బాపు గారి మాటలని గురుతు చేసారు .
అనంతరం బాపు రమణ అవార్డు తో శ్రీ బాచి గారిని శాలువా,మొమెంటో ,ప్రశంశ పత్రంతో సన్మానించారు. శ్రీ శంకర్ గారు వేసిన తలిశెట్టి రామారావు గారి చిత్రాన్ని ప్రథమ,ద్వితీయ,తృతీయ బహుమతి విజేతలకి , బాపు రమణ అవార్డు విజేతకి అందించారు .
వ్యాఖ్యత బిఎస్ శర్మ గారి కొన్ని వ్యాఖ్యలతో సభలో నవ్వులు పూసాయి .
రాము గారి వందన సమర్పణ తో సభ ముగుసింది .
కార్టూనిస్టు ల ఆలింగానాలు, కరచాలనాలు , శుభాకాంక్షలతో , మధురమైన అనుభవాన్ని పదిలంగా దాచుకుని మరో మధురమైన సంవత్సరం కోసం ఆశతో , ఆనందంతో విశ్రమించారు .
18, మే 2015, సోమవారం
సి . ప్రభాకర్ స్మారక గ్రంథాలయం కోరుట్ల వారు నిర్వహించిన , చేతి వ్రాత , చిత్రలేఖనం ఉచిత శిక్షణ శిభిరం నిన్నటి తో ముగిసింది, యాబై మంది పిల్లలకి శిక్షణను ఇవ్వడం జరిగింది . ముగింపు రోజున నాకు చిన్న అభినందన . శిక్షకులలో సర్వశ్రీ శంకర్ శ్రిగద్దె , చిన్నన్న, అశోక్ బొగ , మరియు చిత్రలేఖన నిపుణులు, చేతివ్రాత నిపుణులు కూడా మరికొందరు ఉన్నారు .
8, మే 2015, శుక్రవారం
"రాబోవు రోజుల్లో " 50 వ కార్టూన్ .
ఇది నేను రామశేషు కార్టూనిస్టు గారితో 20-05-2012, తొలి తెలుగు కార్టూనిస్టు ల దినోత్సవం నాడు దిగిన ఫోటో .
అప్పుడు మొదలైన్ది మా స్నేహం , ఆ రోజుల్లో రామశేషు గారు హాస్యానందం మాస పత్రికలో " రామశేషు సమర్పించు సిని ట్యూన్స్ " అనే ఫీచర్ కార్టూన్స్ ఫుల్ పేజి లో వేసేవారు , వాటికి నేను వీరాభిమానిని , ఆ కార్టూన్స్ నన్ను ఎంతగా ఆకట్టు కున్నాయంటే ఆ కార్టూన్స్ లో బొమ్మలు నాతో మాట్లాడేవి , కదిలేవి , కదిలించేవి . అంత లైవ్ లి గా ఉండే బొమ్మలు ఆయన సొంతం .
అలా ఫీచర్ కార్టూన్స్ వేయాలని నాకు అనిపించేది , ఆ విషయం ఒక సారి రామశేషు గారి వద్ద ప్రస్థావిస్తే , www.teluguvennela.com గురించి తెలియజేసి , " రాబోవు రోజుల్లో " అనే అంశం తో కార్టూన్లు గీయమని ప్రోత్సహించారు, దానికి సంబందించిన సలహాలు అందించారు .
ఇప్పుడు మీరు చూసేది "రాబోవు రోజుల్లో " 50 వ కార్టూన్ . ఎన్నో అనుమానాలతో మొదలెట్టిన ఈ ఫీచర్ లో నేను 50 కార్టూన్లు పూర్తి చేసానంటే దానికంతటికి రామశేషు గారి ప్రోత్సాహం, సలహాలే కారణం .
ఆయన నాకు స్నేహితుడు, శ్రేయోభిలాషి, ఫిలాసఫర్, ఆయన బొమ్మలు కార్టూన్లు , నాకు గురువులు .
రామశేషు గారు మీతో స్నేహం ఇలాగే కొనసాగాలని, మీరు నవ్వుతు , మీ కార్టూన్లతో నవ్విస్తూ, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని , ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను .
5, మే 2015, మంగళవారం
మొట్ట మొదటి కారికేచర్
హాస్యానందం మాస పత్రిక సంపాదకులు శ్రీ రాము గారి ప్రోత్సాహంతో నేను వేసిన మొట్ట మొదటి కారికేచర్ .
సిని నటులు శ్రీ ఎల్ . బి . శ్రీరాం గారు , వెర్రి నాగాన్నతో .......... హాస్యానందం మాస పత్రిక మే నెల ఎల్ . బి . శ్రీ రామ్ గారి ప్రత్యేక సంచికలో
సిని నటులు శ్రీ ఎల్ . బి . శ్రీరాం గారు , వెర్రి నాగాన్నతో .......... హాస్యానందం మాస పత్రిక మే నెల ఎల్ . బి . శ్రీ రామ్ గారి ప్రత్యేక సంచికలో

తొలి తెలుగు కార్టూనిస్టు శ్రీ తలిశెట్టి రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని , హాస్యానందం మాస పత్రిక నిర్వహించిన కార్టూన్ పోటిలో విశిష్ట బహుమతి పొందిన నా కార్టూన్ .
న్యాయ నిర్ణేతలు సిని నటులు శ్రీ తనికెళ్ళ భరణి , సిని దర్శకులు శ్రీ జనార్ధన మహర్షి గార్లకు , హాస్యానందం మాస పత్రిక సంపాదకులకు , పోటి నిర్వాహకులకు నా హృదయ పూర్వక ధన్యవాదములు . నా తోటి విజేతలందరికి
శుభాకాంక్షలు , బాపు రమణ అవార్డు విజేత శ్రీ బాచి గారికి ప్రత్యేక అభినందనలు .
న్యాయ నిర్ణేతలు సిని నటులు శ్రీ తనికెళ్ళ భరణి , సిని దర్శకులు శ్రీ జనార్ధన మహర్షి గార్లకు , హాస్యానందం మాస పత్రిక సంపాదకులకు , పోటి నిర్వాహకులకు నా హృదయ పూర్వక ధన్యవాదములు . నా తోటి విజేతలందరికి
శుభాకాంక్షలు , బాపు రమణ అవార్డు విజేత శ్రీ బాచి గారికి ప్రత్యేక అభినందనలు .

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)





